ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరికొన్ని అనుమానస్పద ఆత్మహత్య ఘటనలు కూడా ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఓ కానిస్టేబల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మరో విషయం ఏంటంటే ఆమె మృతదేహంపై 500లకు పైగా గాయాల గుర్తులు ఉండటం అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మహిళ మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ఉన్నావ్ పోలీస్ లైన్లోని వసతి గృహంలో మీను అనే ఓ మహిళా కానిస్టేబుల్ నివాసముంటోంది.
పూర్తిగా చదవండి..Suicide: కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఒంటిపై 500లకు పైగా గాయాలు
ఉత్తరప్రదేశ్లోని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఆమె మృతదేహంపై 500లకు పైగా గాయాల గుర్తులు ఉండటం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. గురువారం తన గదిలో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. పోస్టు మార్టం నివేదికలో ఆమె ఒంటిపై 500లకు పైగా గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఆమెకు మరో కానిస్టేబుల్ యువకునితో ప్రేమ సంబంధం ఉండేదని స్థానికులు తెలిపారు. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవండంతో.. ఈమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Translate this News:











