Telangana Elections: తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. సై అంటే సై అంటూ రంకలు వేస్తున్నాయి. ఈసారి మాదే గెలుపు అంటూ సవాళ్లు విసురుతున్నాయి. ప్రజా యుద్ధానికి అవసరమైన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. గతంలో లాగా కాకుండా ఈసారి ఎన్నికలు హోరాహోరిగా ఉండనున్నాయి. రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై వచ్చే సాధారణ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. అయితే ఇదే సమయంలో ఆ వ్యతిరేకత తగ్గించేందుకు గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..తెలంగాణలో మొదలైన ఎన్నికల వార్.. సై అంటే సై అంటున్న పార్టీలు
తెలంగాణలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలలు ఉన్నా సరే అప్పుడే పార్టీలన్ని ప్రచార యుద్ధంలోకి దిగాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయ చదరంగంలోకి దూకాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ స్టార్ అయింది.

Translate this News:











