Tirupati to get Electric Double-decker Bus: తిరుపతి రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు చక్కర్లు కొట్టనున్నంది. తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి బస్సును ప్రారంభించారు. నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్డు, నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లు, శ్రీనివాససేతుపై నడిపారు. బస్సు బాధ్యతలను ఆర్టీసీకి అప్పగిస్తామని అధికారులు తెలిపారు. త్వరలో నగర రోడ్లపై బస్సును అందుబాటులో తీసుకొస్తామని వివరించారు.
పూర్తిగా చదవండి..Double-decker Bus: దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు సౌకర్యం ఎక్కడంటే..?
తిరుపతి రోడ్లపై ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు త్వరలో చక్కర్లు కొట్టనున్నంది. ఇండియన్ మేడ్ ఫుల్లీ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సును ప్రయోగాత్మకంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులో ఉన్న ఏకైన నగరంగా తిరుపతి చరిత్ర సృష్టించినుంది. అవసరాలను బట్టి భవిష్యత్తులో మరిన్ని డబుల్ డెక్కర్ లను అందుబాటులో తెచ్చేందుకు అధికారులు పరిశీలన చేస్తున్నారు.

Translate this News:











