ఖలిస్తాన్(Khalisthan) టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా మధ్య చిచ్చు రేపుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య వెనక భారత్(Bharat) ప్రమేయముందని..కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో (Trudo) సంచలన ఆరోపణలు చేశారు. భారత్ హస్తముందని ఆరోపించడంతో పాటు తమ దేశంలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యను ఖండించిన భారత్… కెనడాకు బదులిచ్చింది. భారత్లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు మన విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్కేకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Bharat-Canada: భారత్ -కెనడా వివాదం..వాటిపై భారీ ఎఫెక్ట్ చూపనుందా?
దీంతో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా ఇరుకున పడ్డాయి. వచ్చే నెలలో రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్ కూడా వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ మంత్రి తెలిపారు. ఎటువంటి కారణాలు తెలియజేయకుండానే ఈ చర్చల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Translate this News:











