చత్తీస్ గఢ్ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ(Aap) దృష్టి సారించింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind kejriwal) చత్తీస్ గఢ్ లో పర్యటించారు. ఆయన తన పర్యటనలో భాగంగా రాష్ట్ర ఓటర్లకు పలు కీలక హామీలను(garentees) ఇచ్చారు.
పూర్తిగా చదవండి..ఉచిత కరెంట్… నిరుద్యోగ భృతి… ఓటర్లకు కేజ్రీవాల్ కీలక హామీలు..!
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే చత్తీస్ గఢ్ లోనూ అదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు

Translate this News:











