ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. సత్తెనపల్లి దగ్గర బిగుబండ గ్రామానికి చెందిన కుటుంబం గుడిమెట్లలో వజ్రాల వేట కొనసాగిస్తుండగా.. ఓ వజ్రం దొరికింది. వజ్రానికి 6 కోణాలు(షడ్ బుజి వజ్రం) ఉండటంతో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వజ్రాల వ్యాపారులు సుమారు రూ.50-60 లక్షలు పలికే ఆ వజ్రాన్ని రూ.40లక్షలకు కొంటామని బేరాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా గుడిమెట్లలో వజ్రాల వేట సాగుతోంది. గుడిమెట్లను గతంలో రాజులు పరిపాలించంతో ఇక్కడ వజ్రాలు దొరకుతాయని వందలాది మంది వజ్రాల కోసం వెతుకులాట చేస్తున్నారు. ఇటీవల కాలంలో గుడిమెట్లకు జనాల తాకిడి విపరీతంగా పెరిగింది. రాత్రుళ్ల సమయంలో గుడిమెట్లలో నిద్రలు చేసి మరీ వజ్రాల వేట చేస్తున్నారు. మొన్న ఒక్కరోజే మూడు వజ్రాలు దొరికాయని తెలియడంతో భోజనాలు తెచ్చుకుని మరీ వేట కొనసాగిస్తున్నారు.
పూర్తిగా చదవండి..అదృష్టం అంటే ఇదే భయ్యా.. ఒక పూటలోనే లక్షాధికారి అయ్యాడు
మారుమూలన ఉన్న ఓ గ్రామం జనాలతో కిటకిటలాడుతోంది. గంపెడు ఆశలతో ఎక్కడెక్కడ నుంచో ప్రజలు ఆ ఊరు వస్తున్నారు. తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? వందలాదిగా జనం ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

Translate this News:











