ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 2009 ఫిబ్రవరి19వ తేదీన గుణదల ఫ్లైఓవర్ కి శిలాఫలకం వేశారన్నారు. దీంతో నేటికి 5354 రోజులు, 14 సంవత్సరాల 8 నెలలు గడిచాయని మండిపడ్డారు. 3 ప్రభుత్వాలు, ఐదుగురు ముఖ్యమంత్రులు మారారన్నారు. 4 పిల్లర్లు వేసి సరిపెట్టారని ఫైర్ అయ్యారు. 10 సంవత్సరాలు పాటు శాసనసభ్యుడిగా ఉన్న మల్లాది విష్ణు ఈ బ్రిడ్జి గురించి శ్రద్ధ పెట్టడం లేదు కానీ.. సీఎం విశాఖపట్నం మకాం మారుస్తున్నానని ప్రకటించారని ధ్వజమెత్తారు. నాలుగున్నర ఏళ్లుగా సీఎం జగన్ విజయవాడ, అమరావతిలో ఉండి ఏమి ఉద్ధరించారని ప్రశ్నించారు. విజయవాడ నగర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. కనీసం మొండి గోడలతో ఉన్న ఫ్లైఓవర్ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ చేతకానితనానికి, అసమర్థతకు నిదర్శనంగా ఈ బ్రిడ్జి మిగిలిపోయిందన్నారు.
పూర్తిగా చదవండి..Gunadala Flyover : గుణదల బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు?.. మహాధర్నాకు సీపీఎం పిలుపు
వేలాది మంది ప్రజల రాకపోకలకు అవసరమైన విజయవాడ, గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి మొండి గోడలతో మిగిలిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు ఫైర్ అయ్యారు. నేడు స్థానిక ప్రజలతో కలిసి బాబురావు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. మొండి గోడలపై 5354 రోజులు గుర్తు చేస్తూ అంకెలు వేసి, నిరసన తెలిపారు. ఈనెల 26వ తేదీన మహాధర్నాకు పిలుపు ఇచ్చారు.

Translate this News:











