Ex MLA P Vishnuvardhan Reddy: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైన నేపథ్యంలో నేతల అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్(Congress) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి(Vishnu Vardhan Reddy) అనుచరులు వీరంగం సృష్టించారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాలను తగులబెట్టారు. ఇటుకలు, రాళ్లు రువ్వి నానా బీభత్సం సృష్టించారు. బంజారాహిల్స్ టికెట్ను విష్ణువర్ధన్ రెడ్డికి నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేశారు. అజారుద్దీన్కు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. రేవంత్ రెడ్డి ప్లెక్సీలను చించేశారు.
పూర్తిగా చదవండి..Telangana: విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల వీరంగం.. గాంధీభవన్పై రాళ్లతో దాడి..
తెలంగాణ కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ను ప్రకటించడమే ఆలస్యం.. సీటు దక్కని అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్లో వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్ టికెట్ను అజారుద్దీన్కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో గాంధీ భవన్పై రాళ్లు, ఇటుకలు రువ్వారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను చించేసి నానా రచ్చ చేశారు. వీరొక్కరే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టికెట్ దక్కని కాంగ్రెస్ నేతలు తమ నిరసన గళం వినిపిస్తున్నారు.

Translate this News:











