జనగామ ఎమ్మెల్యే టికెట్ పై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) ఆశలు వదులకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం హామీతో ఆయన శాంతించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులను ఇటీవల ప్రకటించిన సీఎం కేసీఆర్ (CM KCR).. జనగామ స్థానానికి మాత్రం ఎవరి పేరునూ ప్రకటించలేదు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కేసీఆర్ మారుస్తున్నారన్న క్లారిటీ వచ్చేసింది. ఈ టికెట్ కోసం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. జనగామను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనకే టికెట్ రాబోతోందని ఆయన అనేక సార్లు ప్రకటిస్తూ వస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: కూకట్పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!
Telangana Politics: ఆశలు వదులుకున్న ముత్తిరెడ్డి.. జనగామలో పల్లాకు లైన్ క్లీయర్?
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే టికెట్ రేసు నుంచి తప్పుకున్నట్లు అర్థం అవుతోంది. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామా టికెట్ విషయంలో లైన్ క్లీయర్ అయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Translate this News:












