ఛత్తీస్గఢ్లోని గోరెలా-పెండ్రా-మార్వాహి, కోర్బా జిల్లాల్లో భూంకంపం సంభవించింది. తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజల్లు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బైకుంత్పూర్లో కూడా భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలోని పలు ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఛత్తీస్గఢ్లో భూకంప కేంద్రం కోర్బా జిల్లాలోని పసన్ సమీపంలో ఉన్నట్లు సమాచారం. భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. గత ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో ఐదుసార్లు భూమి కంపించింది.
పూర్తిగా చదవండి..Earthquake In Chhatisgarh : భూకంపం ధాటికి వణికిపోయిన చత్తీస్గఢ్..ఇళ్లలో నుంచి పరుగులు పెట్టిన జనం..!!
ఛత్తీస్గఢ్లో భూకంపం సంభశించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదు అయ్యింది. భూకంప కేంద్రం కోర్బా జిల్లాలోని పసన్ సమీపంలో ఉన్నట్లు సమాచారం.భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలోని పలు ఇళ్ల గోడలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి.

Translate this News:











