Drunk drive: డ్రంకన్ డ్రైవ్.. ఈ విషయంలో పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..కఠిన చర్యలు చేపట్టినా..మందుబాబులు మాత్రం మారడం లేదు. దీంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వారితో పాటు అమాయక ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఇక యువకులు డ్రంకన్ డ్రైవ్ చేస్తూ.. ప్రాణాల మీదకే తెచ్చుకొని కన్నవారికి కడు విషాదాన్నే మిగుల్చుతున్నారు.
పూర్తిగా చదవండి..Drunk drive:మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం.. .చాదర్ ఘాట్ లోనూ..
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో డ్రంకన్ డ్రైవ్ కారణంగా ఓ కారు బీభత్సం సృష్టించింది. తాగిన మత్తులో యువకుడు ర్యాష్ గా డ్రైవ్ చేయడంతో కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు విద్యార్థుల్లో నుంచి ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక చాదర్ ఘాట్ రహదారి పై మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ హల్ చల్ చేశాడు. చాదర్ ఘాట్ బ్రిడ్జి పై మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. పలు వాహనాలను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా కారుతో షాప్ లోకి దూసుకుపోయాడు.

Translate this News:











