ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నేతల ప్రచారాలతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక నామినేషన్లు వేసే సమయంలో కారు, బైకు, లేదా ట్రాక్టర్పై తమ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్తుంటారు. కానీ ఓ స్వతంత్ర అభ్యర్థి మాత్రం నామినేషన్ వేసేందుకు వినూత్న ప్రయాణం చేశారు. ఏకంగా ఓ గాడిదపై వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుర్హాన్పూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అయిన ప్రియాంక్ థాకూర్ అనే వ్యక్తి ఇలా గాడిదపై వెళ్లి అందర్ని అవాక్కయ్యేలా చేశారు.
పూర్తిగా చదవండి..వాటే ఐడియా గురూ.. గాడిదపై వచ్చి నామినేషన్ వేశాడు..
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి గాడిదపై వెళ్లి నామినేషన్ వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఇలా గాడిదపై వచ్చి నామినేషన్ వేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Translate this News:











