రాజధాని అమరావతి కోసం భూసేకరణ పై చంద్రబాబు ప్రభుత్వ తీరును కాగ్ ఎండగట్టింది. అలాగే జగన్ ప్రభుత్వానికి కూడా చురకలు అంటించింది. రాజధాని కోసం భూసేకరణ లో నిపుణుల కమిటీ సిఫార్సులను చంద్రబాబు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొలేదని స్పష్టం చేసింది. రాజధానికి అవసరమైన మొత్తం భూమిలో 70 శాతం భూ సమీకరణ ద్వారా సేకరించాలనే నిర్ణయం వల్ల భారీ ఆర్థిక భారం పడిందని కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది. అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల వల్ల నిధులు నిరుపయోగం పై ప్రస్తుత జగన్ ప్రభుత్వ తీరును కూడా కాగ్ తప్పుబట్టింది. 2019 మే నుంచి వివిధ పనులను నిలిపి వేశారని కాగ్ తెలిపింది. దీని వల్ల ఈ పనుల కోసం ఖర్చు చేసిన 1,505 కోట్లు నిరుపయోగం అయ్యాయని తెలిపింది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి కన్సల్టెంట్ లను సరైన విధానాన్ని అనుసరించకుండా నామినేషన్ పద్దతిలో ఎంపికచేయడాన్ని కాగ్ నివేదికలో తప్పుబట్టింది. స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఏపీసిఆర్డిఏ , పీడీసిఎల్ లు 33,476.23 కోట్లతో కౌళిక సదుపాయల ప్యాకేజి ల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని కాగ్ తెలిపింది. 2016-23 కాలానికి 55,343 కోట్ల రూపాయలు అవసరం కాగా ఏపీ సిఆర్డిఏ అన్ని వనరుల నుంచి 11,487.16 కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించాయని తెలిపింది. 2019 ఫిబ్రవరి తరువాత రూపొందించిన ఆర్థిక ప్రణాళిక ప్రకారం బడ్జట్ తోడ్పాటును ఇవ్వలేదని తెలిపింది. కనీసం ఇచ్చే ప్రయాత్నాలు కూడా చేయలేదని స్ఫష్టం చేసింది.
పూర్తిగా చదవండి..AP politics:జగన్ సర్కార్ కు కాగ్ చురకలు.. నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కూడా..
రాజధాని అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని కాగ్ తన నివేదికలో పరోక్షంగా తెలిపింది. రాజధాని కోసం భూ సేకరణ నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొనకుండా, రాజధానికి అవసరమైన భూమి మొత్తంలో 70 శాతం భూ సమీకరణ విధానం ద్వారా సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం , రాబోయే కాలంలో భారీ ఆర్థిక భారం పడిందని కాగ్ తన నివేదికలో తెలిపింది. అలాగే జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల చేయడం వల్ల నిధులు నిరుపయోగం అయ్యాయని కాగ్ తన నివేదికలు తేల్చి చెప్పింది.

Translate this News:











