Telangana Elections: అసెంబ్లీ ఎన్నికల సమరంలో బీఎస్పీ(BSP) మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బహుజన భరోసా పేరిట తీసుకొచ్చిన ఈ ఎన్నికల ప్రమాణ పత్రంలోని ప్రతి అంశంలో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్(RS Praveen Kumar) మార్క్ స్పష్టంగా కనబడుతోంది. ప్రతి పౌరునికి రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన వాటినే మేనిఫెస్టోగా మలిచినట్లుగా తెలుస్తోంది. విద్య, వైద్యం, వసతి, ఉద్యోగం, ఉపాధి అంశాల చుట్టూ మేనిఫెస్టోను రూపొందించింది బీఎస్పీ. యువతకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు మేనిఫెస్టోలో పెద్దపీట వేసింది. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు భరోసానిచ్చే పథకాలనూ ప్రకటించింది. ఆరోగ్యానికి, పౌష్టికాహారానికి ప్రాధాన్యత కల్పించింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య, యువతకు సాంకేతిక నైపుణ్యం, భారీగా ఉద్యోగాల కల్పన, సామాన్యులు, సాధారణ గృహిణుల చేతికి టెక్నాలజీ వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana: బీఎస్పీ మేనిఫెస్టో విడుదల.. విద్య, వైద్యం, వసతి, ఉద్యోగం, ఉపాధి అంశాలే కీలకం..
అసెంబ్లీ ఎన్నికల సమరంలో బీఎస్పీ మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బహుజన భరోసా పేరిట తీసుకొచ్చిన ఈ ఎన్నికల ప్రమాణ పత్రంలోని ప్రతి అంశంలో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ మార్క్ స్పష్టంగా కనబడుతోంది. ప్రతి పౌరునికి రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన వాటినే మేనిఫెస్టోగా మలిచినట్లుగా తెలుస్తోంది. విద్య, వైద్యం, వసతి, ఉద్యోగం, ఉపాధి అంశాల చుట్టూ మేనిఫెస్టోను రూపొందించింది బీఎస్పీ.

Translate this News:











