బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Kotha Prabhakar Reddy) కత్తితో దాడి చేసిన వ్యక్తిని దుబ్బాక నియోజకవర్గం చెప్యాలకు చెందిన గటని రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నిందితుడి ఫొటోను బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ చేశారు. మద్యం మత్తులోనే అతడు దాడికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ రోజు దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Breaking: కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచింది ఇతడే.. ఫొటో రిలీజ్ చేసిన బీఆర్ఎస్!
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని దుబ్బాక నియోజకవర్గం చెప్యాలకు చెందిన గటని రాజుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నిందితుడి ఫొటోను బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తన్వ ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు.

Translate this News:











