తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. మంత్రి పువ్వాడ అజయ్ కుమర్ను టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగేవారని.. కానీ ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయంటూ జనాలు నాకు చెబుతున్నారంటూ ఆరోపించారు. మంత్రి అజయ్ కుమార్ నాలుగేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఖమ్మంలోని BRSKV TATU అధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. తుమ్మలకు కౌంటర్ వేశారు. రౌడీయిజం, గుండాయిజం పెంచి పోషించింది నువ్వు కాదా.. ప్రజలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచింది నువ్వు కాదా అంటూ ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Telangana: మంత్రి పదవి ఇచ్చినా అందరినీ మోసం చేశావ్.. తుమ్మలకు పువ్వాడ కౌంటర్..
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పై తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి పువ్వాడ.. తుమ్మలపై ఫైర్ అయ్యారు. రౌడీయిజం, గుండాయిజం పెంచి పోషించింది నువ్వు కాదా.. అంటూ ధ్వజమెత్తారు. నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో ఎంతమంది రాజకీయ సమాధీ అయ్యారో తెలియదా అంటూ ప్రశ్నించారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఇచ్చిన పదవులు పొంది వాళ్లని మోసం చేసి.. చివరికి కేసీఆర్ దగ్గర చేరావని.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్లావంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం ప్రజల్ని ఎవరు మోసం చేశారో వాళ్లే ఎన్నికల్లో నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించారు.

Translate this News:











