బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmanthrao), ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula veeresham), కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో వారికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వని కారణంగా మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తనకు టికెట్ కేటాయించిన తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో బీఆర్ఎస్ కూడా ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన హస్తం గూటికి చేరారు. మైనంపల్లితో పాటే ఆయన కుమారుడు రోహిత్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
పూర్తిగా చదవండి..Big Breaking: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కీలక నేతలు.. మైనంపల్లితో పాటు..
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Translate this News:












