Etela Rajender : దేశప్రధానిపై కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) మాట్లాడిన మాటలకు ప్రజల తలదించుకుంటున్నారన్నారు. ప్రధాని రాకపై ఫ్లెక్సీలు పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని రావణాసురునితో పోల్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పై ఈటెల మండిపడ్డారు. ఇలాంటి సీఎం మన రాష్ట్రానికి ఉన్నందుకు ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. ఇలాంటి గ్లోబల్ ప్రచారం చేయడంలో కేసీఆర్ ను మించినవారు ఇంకేవ్వరూ లేరన్నారు.
పూర్తిగా చదవండి..Etela: చీటర్ మోదీ కాదు మీ అయ్య – కేటీఆర్ పై ఈటల ఇంకా ఏమన్నారంటే?
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయాలు మరింత హాట్ హాట్ మారాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొసాగుతోంది. ప్రధాని మోదీ ప్రసంగంపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రధానిని రావణాసురునితో పోల్చుతూ..చిల్లరగా మాట్లాడుతున్నారంటూ మండిపట్టారు. చీటర్ మోదీ కాదు మీ అయ్య అంటూ కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు ఈటెల రాజేందర్.

Translate this News:











