Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్న జరిగిన ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో ప్రియాంక, అర్జున్, అశ్విని, ప్రశాంత్, భోలే, సందీప్ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపిక అయ్యారు. ఈ వారం జరిగిన గులాబీపురం, జిలేబీపురం టాస్క్ లో.. శివాజీ రెండు ఊళ్ళ పెద్ద మనిషిగా ఉన్నందున శివాజీకి నేరుగా కంటెండర్ అయ్యే అవకాశం ఉందని బిగ్ బాస్ పేర్కొన్నాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే.. శివాజీ (Sivaji) కంటెండర్ అవ్వాలంటే ఇప్పటికే కంటెండర్లు గా ఉన్న ప్రశాంత్ (Pallavi Prashanth), భోలే, ప్రియాంక, సందీప్,అర్జున్, అశ్విని ఈ ఆరుగురు నుంచి ఒకరు రేసు నుండి తప్పుకోవాల్సి ఉంటుందని తెలిపాడు బిగ్ బాస్.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: అందరి ముందు ఏడవలేకపోతున్న.. ఎమోషనల్ అయిన శివాజీ ..!
బిగ్ బాస్ సీజన్ 7 గులాబీపురం, జిలేబీపురం ఈ టీమ్స్ మధ్య కెప్టెన్సీ టాస్క్ 4 లెవెల్స్ లో జరిగింది. జరిగిన 4 లెవెల్స్ లో జిలేబీపురం టీం ఎక్కువ టాస్క్ లు విన్ అవ్వడంతో ఆ టీం సభ్యులైన ప్రియాంక, శివాజీ , సందీప్, అర్జున్, అశ్విని, ప్రశాంత్ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికయ్యారు. కానీ ఈ ఆరుగురిలో ఎవరు కెప్టెన్సీ రేసులో ఉండాలి అని డిసైడ్ చేసేది మాత్రం ఓడిపోయిన గులాబీపురం టీం సభ్యులు. ఇక ఈ టాస్క్ లో గులాబీపురం సభ్యులు పలు కారణాలు చెప్పి ప్రియాంక, ప్రశాంత్, అశ్విని, శివాజీని రేసు నుంచి తొలగించారు. ఇక చివరిలో మిగిలిన సందీప్, అర్జున్ ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ ఆడబోతున్నట్లు బిగ్ బాస్ తెలిపారు.

Translate this News:












