ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komatireddy Venkat Reddy) ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ను తాము దగ్గరుండి గెలిపించామన్నారు. గెలిచిన తర్వాత తమనే ఆయన దారుణంగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. మొదట తాము చిరుమర్తి లింగయ్యను జడ్పీటీసీ గా గెలిపిస్తే.. పెద్ద పదవి తనకు ఎందుకు అని అన్నాడని గుర్తు చేశారు కోమటిరెడ్డి. తర్వాత ఆయనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని చెప్పారు.
పూర్తిగా చదవండి..Komatireddy: నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనే.. కోమటిరెడ్డి సంచలన ప్రకటన
వేముల వీరేశంను నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రేపటి నుంచి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ రోజు కోమటిరెడ్డిని వీరేశం మర్యాదపూర్వంగా కలిసిన సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు కోమటిరెడ్డి.

Translate this News:











