Bhavya Sri News: భవ్యశ్రీ మృతిపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాటల్లో వాస్తవాలు లేవని ఆర్టీవీతో భవ్యశ్రీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్పీ ఫోరెన్సిక్ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భవ్యశ్రీ తల్లి పద్మ. ఎవరూ ఎన్ని చెప్పినా తన బిడ్డది హత్యేనంటూ ఆక్రోశం వెల్లగక్కారు. పోలీసులు కేసును ప్రక్క దారి పట్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. నా బిడ్డ నా వల్లె చనిపోయిందని అంటుంటే గుండె బరువెక్కి పోతుందని వాపోతోంది. ఎస్పీ చూపిన దుస్తులు నా బిడ్డ ధరించింది కాదని వెల్లడించింది. నా బిడ్డ మృతిదేహంపై దుస్తులు రీ-ప్లేస్ చేశారని అంటోంది. నేను కొట్టడం,మందలించడం వల్లే నా బిడ్డ ఆత్మహత్య చేసుకుందని అంటున్నారని..అయితే, నా కారణంగానే నా కూతురు చనిపోయింటే సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరుతానంటూ ప్రశ్నించింది. ఎస్పీ మాటల్లో ఏ మాత్రం వాస్తవాలు లేవని వాపోతోంది. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తా అంటూ వ్యాఖ్యనించింది. పోలీసులపై తనకు నమ్మకం లేదని,సీబీఐ విచారణ కోరుతానని తెలిపింది.
పూర్తిగా చదవండి..Bhavya sri: భవ్యశ్రీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ పై తల్లిదండ్రులు ఎమన్నారంటే..?
భవ్యశ్రీ మృతిపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాటల్లో వాస్తవాలు లేవని ఆర్టీవీతో భవ్యశ్రీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్పీ ఫోరెన్సిక్ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భవ్యశ్రీ తల్లి పద్మ. ఎవరూ ఎన్ని చెప్పినా తన బిడ్డది హత్యేనంటూ ఆక్రోశం వెల్లగక్కారు. పోలీసులు కేసును ప్రక్క దారి పట్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. నా బిడ్డ నా వల్లె చనిపోయిందని అంటుంటే గుండె బరువెక్కి పోతుందని వాపోతోంది.

Translate this News:











