ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆశా వర్కర్లు రోడ్డుపై బైటాయించి తమకు గౌరవ వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. నీరసన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆశా వర్కర్లకు 18,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తానని సీఎం కేసీఆర్ గతంలోనే హామి ఇచ్చారని వారు గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం తమకు ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Khammam: పువ్వాడ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లు
ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమకు గౌరవ వేతనంగా 18,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Translate this News:











