వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్వా రైతులకు అండగా నిలవాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయంలో భాగంగా ఆక్వా సాధికారిత కమిటీ ఏర్పాటయ్యిందని అన్నారు. గతంలో ఆక్వా ఫీడ్, సీడ్ రేట్లను నియంత్రించే విధానం లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదొడుకులకు స్థానికంగా ఆక్వారంగం ఇబ్బందులను చవిచూసిందని చెప్పారు. వీటిని క్రమబద్దీకరించేందుకు సాధికారిత కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.
పూర్తిగా చదవండి..Amaravati: ఆ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. మంత్రి పెద్దిరెడ్డి కీలక ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా పరిశ్రమలో ఒడిదొడుకులను నివారించేందుకు ప్రభుత్వం నియమించిన సాధికారిత కమిటీ కారణంగా ఇప్పటి వరకు ఆరు సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగామని కమిటీ సభ్యులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు తెలిపారు.

Translate this News:











