ఏపీ రాజధాని విశాఖకు మారడం మీద సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు వైజాగ్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతానని…డిసెంబర్ లోగా వచ్చేస్తానని జగన్ కన్ఫార్మ్ చేశారు. రాష్ట్రంలోనే విశాఖ పెద్ద నగరం అని అందుకే విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుందని తెలిపారు. అభివృద్ధిలో విశాఖ నగరం శరవేగంగా దూసుకుపోతోందని జగన్ అన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా తయారైందని…మరికొన్ని రోజుల్లో హైదరాబాద్,బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని చెప్పారు. విశాఖలో పెట్టుబడుల పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు.
పూర్తిగా చదవండి..Ap CM Jagan:త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతా-ఏపీ సీఎం జగన్
త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవున్నాను అంటూ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. పరిపాలనా విభాగం అంతా విశాఖకు మారుతుందని కన్ఫార్మ్ చేశారు. డిసెంబర్ లోపు ఇక్కడకు మారుతానని చెప్పారు. ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ రూపుదిద్దుకుంటోందని అన్నారు. అన్ని రంగాల్లో విశాక అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ కు హబ్ గా మారిందన్నారు జగన్.

Translate this News:











