ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (AP CID IRR Case) దర్యాప్తు అధికారి మార్పు చేసింది సీఐడీ (CID). ప్రస్తుతం ఉన్న ఏఏస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ భాస్కర్ కు బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖల్ చేసింది. జయరాజుకు పని భారం ఎక్కువగా ఉండటంతో దర్యాప్తు అధికారిని మార్పు చేసినట్లు పిటిషన్ లో సీఐడీ (CID) పేర్కొంది. ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నేడు సెలవులో ఉన్నారు. దీంతో కోర్టులో జరగాలసిన విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల విచారణ సైతం రేపటికి వాయిదా పడింది.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu Case Updates: చంద్రబాబుకు బిగ్ షాక్.. తాజా అప్టేట్స్ ఇవే!
IRR Case: ఇన్నర్ రింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తు అధికారి ఔట్!
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారిని సీఐడీ మార్చింది. ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఏస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ భాస్కర్ కు బాధ్యతలు అప్పగించింది.

Translate this News:











