ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు (Chandrababu Naidu) షాక్ తగిలింది. పీటీ వారెంట్ పై ఆయనను విచారించేందుకు ఏసీబీ కోర్టు (ACB Court) అనుమతిచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5 గంటలలోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశించారు. ఇదిలా ఉంటే చంద్రబాబదు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్ ను విచారణకు స్వీకరించింది ఏసీబీ కోర్టు. ఈ పిటిషన్ ను రేపటికి వాయిదా వేయాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరగా అందుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఒప్పుకోలేదు. దీంతో ఏసీబీ కోర్టులో ఆ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రేపు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ ఈ నెల 19వ తేదీ వరకు ఉంది.
ఇది కూడా చదవండి: CM Jagan: పవన్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకు ఏపీలో ఇల్లే లేదు: సీఎం జగన్ విమర్శల వర్షం
Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఊహించని షాక్
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. పీటీ వారెంట్ పై ఆయనను విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది.

Translate this News:











