Ganesh Immersion in Hyderabad: భాద్రపద శుద్ధ చవితి రోజున భూలోకానికి విచ్చేసి.. తిమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకుని, వారు అర్పించిన నైవేద్యాలను ఆరగించిన గణపయ్య.. కైలాసానికి తిరుగుపయనమయ్యేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నాడు బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గణనాథుల విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గణేషుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు. భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కోసం సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే మహానగరం వ్యాప్తంగా మరో 100 చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. గణేషుడి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి దుర్ఘటనలు జరుగకుండా చూసేందుకు హుస్సేన్ సాగర్తో పాటు.. ఇతర నీటి కొలనుల వద్ద 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇక మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. దాదాపు 40 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 25వేల మందితో భద్రత కట్టుదిట్టం చేశారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13వేల మంది బలగాలు మోహరించాయి. బందోబస్తు విధుల్లో ఆర్ఏఎఫ్, పారా మిలటరీ, అదనపు బలగాలు పాల్గొననున్నాయి. బందోబస్తుకు వచ్చిన పోలీసులు.. దాదాపు 36 గంటల పాటు విధుల్లో ఉండనున్నారు.
పూర్తిగా చదవండి..Ganesh Immersion: గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం.. హుస్సేన్ సాగర్లో ఏర్పాట్లు ఇవే..
భాద్రపద శుద్ధ చవితి రోజున భూలోకానికి విచ్చేసి.. తిమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకుని, వారు అర్పించిన నైవేద్యాలను ఆరగించిన గణపయ్య.. కైలాసానికి తిరుగుపయనమయ్యేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నాడు బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గణనాథుల విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

Translate this News:











