తిరుమల వెళ్లాలని ప్లాన్ లో ఉన్న శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 28న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 8 గంటల పాటు మూసివేయనున్నారు. అక్టోబర్ 29వ తేదీ ఉదయం 1.05 గంటల నుంచి 20.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగానే 28వ తేదీ రాత్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అక్టోబర్ 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. తిరిగి 29వ తేదీ ఉదయం 3.15 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. 8 గంటలపాటు శ్రీవారి భక్తులు దర్శనం రద్దు అవుతుంది. గ్రహణం కారణంగా ఈ నెల 28న సహస్ర దీపాలంకరణ సేవ, వికలాంగులు, వయో వృద్ధులకు దర్శనం రద్దు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే!
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28వ తేదీ రాత్రి 7.05 గంటలకు మూసివేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరిగి 29వ తేదీ ఉదయం 3.15 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకుంటాయి.

Translate this News:











