Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party) దూకుడు పెంచింది. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఇవాళో రేపో సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేయనుంది. ఇక ప్రచార పర్వంలోనూ స్పీడ్ పెంచింది కాంగ్రెస్. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ పర్యటన తేదీలు ఫిక్స్ అయ్యాయి. అక్టోబర్ 28న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణకు వస్తుండగా.. ఆదివారం నాడు అంటే అక్టోబర్ 29న తెలంగాణకు రానున్నారు మల్లిఖార్జున ఖర్గే. వీరిద్దరూ కలిసి తెలంగాణలో పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వీరి షెడ్యూల్ వివరాలను ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Telangana Elections: దూకుడు పెంచిన కాంగ్రెస్.. తెలంగాణలో ఖర్గే, డీకే శివకుమార్ ప్రచారం..
తెలంగాణలో ఈసారి అధికారం తమదే అంటున్న కాంగ్రెస్ పార్టీ.. మరింత దూకుడు పెంచింది. పార్టీ అగ్ర నేతలను ప్రచార పర్వంలోకి దించింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వస్తున్నారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు. చేవెళ్ల, పరిగి, తాండూరు, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ లో వీరు ప్రచారం చేస్తారు.

Translate this News:











