వరల్డ్కప్(World Cup)లో ఓటమి అనే పదానికి అర్థమే తెలియని జట్టుగా వరుస విజయాలతో దూసుకుపోతోంది టీమిండియా. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లకి ఆడితే ఏ ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు రోహిత్ సేన. తమకు గట్టి పోటి ఇస్తుందని భావించిన న్యూజిలాండ్ కూడా భారత్పై తేలిపోయింది. నెట్రన్రేట్లోనూ పాయింట్లలోనూ ఇండియాకు తిరుగేలేదు. ఇప్పటివరకు 10 పాయింట్లతో టీమిండియా టాప్ పొజిషన్లో ఉంది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే టీమిండియా సెమీస్కు వెళ్లడం దాదాపు ఖాయమే. ఇండియా ఇంకో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తర్వాతి మ్యాచ్పై ఇంగ్లండ్(England)పై ఆడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 29న అంటే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది.
పూర్తిగా చదవండి..World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. తర్వాతి రెండు మ్యాచ్లకు స్టార్ ప్లేయర్ దూరం!
వరల్డ్కప్లో వరుస విజయాలతో ఇరగదీస్తున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్ ఇది. అక్టోబర్ 29న ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్కు స్టార్ ఆల్రౌండర్ పాండ్యా అందుబాటులో ఉండడంలేదు. బంగ్లాదేశ్పై మ్యాచ్లో పాండ్యా గాయపడ్డ సంగతి తెలిసిందే. అతను గ్రౌండ్లో దిగడానికి మరింత సమయం పడుతుందని సమాచారం.

Translate this News:












