మేడిగడ్డ (Medigadda Barrage) చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతుంది. కేసీఆర్ ను (CM KCR) లక్ష్యంగా చేసుకుని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. లక్ష కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్, కాంట్రాక్టర్ కలిసి దిగమింగారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు కేసీఆర్ రాజీనామా చేయాలని పట్టుపడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపైన విమర్శలు వస్తున్న వేళ కేంద్రం నుంచి వచ్చిన ఆర్గురు సభ్యుల నిపుణుల కమిటీ ప్రాజెక్టు సందర్శనకు రావటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరో వైపు ఎన్నికలు సంభవిస్తున్న వేళ ఈ సంఘటనలు చోటుచేసుకోవటంతో దీని వెనక కుట్రకోణం ఉందనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: KTR: కర్ణాటక వీడియోతో కాంగ్రెస్ పై కేటీఆర్ పంచ్ లు.. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ..!
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ రాజకీయ దుమారం.. అసలేం జరుగుతోంది?
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మంగళవారం బ్యారేజ్ ను పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద ఏర్పడ్డ పగుళ్లను పరిశీలించిన బృందం సభ్యులు.. ఇందుకు గల కారణాలు ఏంటనే అంశంపై దృష్టి సారించారు. బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై ఈ కమిటీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Translate this News:











