కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) ఆ పార్టీని వీడనున్నారు. ఈ రోజు సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. కొన్నిరోజుల క్రితమే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు జిట్టా. అయితే.. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి (Kumbham Anil Kumar Reddy) భవనగిరి టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారం సాగుతుండడంతో జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డికి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని జిట్టాకు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీలో చేరేందుకు అంగీకరించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ రోజు భువనగిరిలో జరగనున్న సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో జిట్టా బాలకృష్ణారెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Telangana BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే?
TS Politics: కాంగ్రెస్ కు జిట్టా బాలకృష్ణారెడ్డి షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇటీవల పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు భువనగిరిలో జరగనున్న బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

Translate this News:











