ఏపీ(AP)లో ఎన్నికల హీట్ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ(Telangana)లో ఎన్నికల నగరా మొగడంతో ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. సిఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రజాపత్రినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. అయితే టీడీపీ(TDP),జనసేన(Janasena) పార్టీల కలయిత తర్వాత టీడీపీలో అసమ్మతిగా ఉన్న నేతలతో సఖ్యత పెంచుకోవాలని జనసేనాని ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ ముఖ్యనేతలు టీడీపీ క్యాడర్ను కలుపుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ప్రారంభించారు. ఏలూరు(Eluru) నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఈ ప్రక్రియ ప్రారంభించింది.
పూర్తిగా చదవండి..Eluru Politics: ఏలూరు టిక్కెట్ ఎవరికి? నగరంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ..!
టీడీపీ నిరసన కార్యక్రమాల్లో తొలిసారి తెలుగుదేశంతో కలిసి జనసేన పార్టీ పాల్గొనడం నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఏలూరు టిక్కెట్ మాత్రం అటు టీడీపీ అభ్యర్దికి ఇస్తారా లేక జనసేన పార్టీ అభ్యర్దికి ఇస్తారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయంటూ జనసేనాని ప్రకటించిన తరువాత బడేటి చంటిలో జోష్ తగ్గింది. ప్రస్తుతం ఆయన నామమాత్రంగానే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దింతో ఏలూరు టిక్కెట్ ఏ పార్టీ అభ్యర్దికి ఇస్తారనే ఉత్కంఠ ఏలూరు ఓటర్లలో నెలకొంది.

Translate this News:











