తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. బీసీ నేతలు, ఓయూ విద్యార్థులు, మహిళా నేతలు తమకు తగిన సంఖ్యలో సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు మరికొంత మంది ముఖ్య నేతలు తమతో పాటు అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Khammam Ex MP Ponguleti Srinivas Reddy) కూడా తన వర్గానికి చెందిన 15 మందికి టికెట్ల ఇవ్వాలంటూ ఈ రోజు అగ్రనేతలను కలవనున్నారు. ఈ రోజు ఆయన ? వెళ్లారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తో పాటు ఏఐసీసీ అగ్రనేతలతో ఆయన భేటీ కానున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: కాంగ్రెస్ 63 మంది అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే?
TS Congress Politics: హుటాహుటిన ఢిల్లీకి పొంగులేటి.. ఆ 15 సీట్ల కోసం పట్టు?
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. తాను ప్రతిపాదించిన వారికి మొత్తం 15 టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ ను ఆయన కోరనున్నారు.

Translate this News:











