Tirupati: ఏపీలో కీలక నియోజకవర్గాల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం ఒకటి. హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల నియోజకవర్గ పరిధిలోకి రావడమే అందుకు కారణం. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అంటే సాక్షాత్ వేంకటేశ్వరస్వామి సేవకు నియమితులైనట్లే. ప్రస్తుతం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే ఆయన టీటీడీ చైర్మన్ గా నియమితులయ్యారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతారని ప్రచారం జరుగుతోంది.
పూర్తిగా చదవండి..Tirupati: హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి వైసీపీ అభ్యర్థి ఇతనే..!
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు భూమన అభినయ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి బరిలో దిగుతున్నట్లు వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. రిసెంట్ గా కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ సీఎం జగన్ ను కలిశారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని గెలవాలని సీఎం జగన్ వారికి దిశ నిర్దేశం చేశారని సమాచారం.

Translate this News:













