ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఉగ్రవాదిని భారత్ హతమార్చిందని ఆయన మంగళవారం పలు ఆరోపణలు చేశారు. ట్రూడో వ్యాఖ్యలతో భారత్, కెనడాల మధ్య దౌత్య స్థాయిలో పోరు మొదలైంది. విదేశాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా కఠిన చర్యలు తీసుకోకూడదనేది భారత విధానం. స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఖలిస్తాన్పై తనకున్న ప్రేమ కారణంగా ఈ ప్రకటన చేశారు. దాని కారణంగా రెండు దేశాల మధ్య దశాబ్దాల స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి. జస్టిన్ ట్రూడో ఆరోపణల ఫలితంగానే భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. ట్రూడో కామెంట్స్ ఇరు దేశాల దౌత్యవేత్తలు కూడా బహిష్కరించే స్థాయికి చేరుకున్నాయి.
పూర్తిగా చదవండి..India Canada Row : పరువు పోగొట్టుకున్న కెనడా..మండిపడుతున్న అగ్రదేశాలు..!!
కెనడా భారత్తో సత్సంబంధాలను చెడగొట్టుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదిని హతమార్చడం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అలాంటి ఆరోపణలను భారత్ ఖండించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఇండియా పరువు తీసేందుకు కెనడా చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్ కెనడాకు సపోర్టు చేయలేదు. భారత్ విషయంలో కెనడా వైఖరి తప్పని చెప్పకనే చెప్పాయి. భారత్ పరువు తీయాలనుకున్న కెనడా తన పరువు తానే తీసుకున్నట్లయ్యింది.

Translate this News:











