Chandrayaan-3 : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం గ్రీస్ నుంచి బెంగళూరు చేరుకుని ఇస్రో శాస్త్రవేత్తల(ISRO Scientists)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. బెంగుళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇస్రో కమాండ్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ఇప్పుడు శివ-శక్తి (Shiva-Shakthi) అని, చంద్రయాన్-2 పాదముద్ర వేసిన ప్రదేశాన్ని తిరం (Tiranga) గా అని పిలుస్తామని ఆయన చెప్పారు.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: ఆ ప్రాంతానికి ‘శివశక్తి’, పాదముద్రను వదిలిన ప్రదేశానికి ‘తిరంగా’ అని నామకరణం..!!
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకుని బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని సక్సెస్ చేసి భారత సత్తా ఏంటో చూపించిన ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. శనివారం ఉదయం బెంగుళూరులోని హాల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు నేరుగా బెంగుళూరు వచ్చానని మోదీ అన్నారు.

Translate this News:











