బీహార్లోని బక్సర్లోని రఘునాథ్పూర్ స్టేషన్లో బుధవారం రాత్రి రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు ఆనంద్ విహార్ నుంచి వస్తున్నట్లు సమాచారం. ఆనంద్ విహార్ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి .సమాచారం ప్రకారం, ఆనంద్ విహార్ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, దాదాపు 100 మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే అధికారులు, రైల్వే సిబ్బంది ప్రత్యేక రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..North East Express: ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్, 6గురు మృతి..పలువురికి తీవ్ర గాయాలు..!!
బీహార్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న ఆనంద్ విహార్ కామాఖ్య నార్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. రైలులోని ఆరు బోగిలు కిందపడిపోయాయి. వీటిలో మూడు బోగీలు పూర్తిగా బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. వందకు పైగా ప్రయాణికులకు గాయాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Translate this News:











